హైదరాబాద్‌కు చేరిన కృష్ణ ఎర్రవెల్లి మృతదేహం | Krishna Erravalli Dead body reaches Hyderabad | Sakshi
Sakshi News home page

Dec 22 2017 1:19 PM | Updated on Apr 4 2019 3:25 PM

Krishna Erravalli Dead body reaches Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాలిఫోర్నియాలో తాజాగా ప్రమాదంలో మరణించిన కృష్ణ భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ ఉదయం కార్గొ ఫ్లైట్‌లో మృతదేహాన్ని తీసుకొచ్చారు. తెలంగాణకు చెందిన కృష్ణ ఎర్రవెల్లి ఈనెల 14న  శాన్ జోస్ లో ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. 

కృష్ణ కుటుంబంతో కొలంబస్ హవాయ్ లో ఉంటూ.. వర్క్ కోసం మూడు వారాల క్రితం కాలిఫోర్నియా వెళ్లాడు. నడుచుకుంటూ వెళుతున్న కృష్ణ ఎర్రవెల్లి ని వెనక నుంచి VTA ట్రైన్ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ  మృతిచెందాడు. కాగా,  కృష్ణ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు జూబ్లిహిల్స్‌ మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement