
‘ఢిల్లీని ఏడాదిలో లండన్గా మారుస్తా’
ఢిల్లీని లండన్లా తయారు చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీని లండన్లా తయారు చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో తమకు విజయాన్ని కట్టబెడితే, ఢిల్లీ మొత్తాన్ని క్లీన్ చేస్తానని, కచ్చితంగా లండన్ అంత గొప్పగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గత పది, పదిహేనేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేయలేనిది తాము అధికారం చేపట్టిన రెండేళ్లలోనే ఢిల్లీలో చేశామని అన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకు 67 స్థానాలు ఇచ్చారు. కానీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అస్సలు అలాంటి నిడివి ఇవ్వొద్దు. పూర్తి విజయం కట్టబెట్టండి. ఎంసీడీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఢిల్లీని లండన్ ఒకే ఏడాదిలో తయారు చేసి చూపిస్తాం’ అని కేజ్రీవాల్ చెప్పారు. త్వరలో ఎంసీడీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ప్రచారానికి వెళ్లిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు గుర్తింపులేని కాలనీలకు గుర్తింపు ఇవ్వాలని తాము కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపించామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో ఉందని గుర్తు చేశారు.