పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. పాత రూ. 500, 1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో నాలుగు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే.
వీటిలో రెండింటిని ఢిల్లీకి చెందిన అడ్వొకేట్లు వివేక్ నారాయణ్ శర్మ, సంగంలాల్ పాండేలు దాఖలు చేయగా మిగిలిన రెండు వ్యాజ్యాలను ఎస్.ముత్తుకుమార్, ఆదిల్ ఆల్వే వేశారు.