బిహార్‌కు రూ. 500 కోట్ల సాయం | Rs. 500 crore assistance to Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌కు రూ. 500 కోట్ల సాయం

Aug 27 2017 2:56 AM | Updated on Aug 15 2018 2:32 PM

వరదలపై  మోదీ, నితీశ్‌ ఏరియల్‌ సర్వే - Sakshi

వరదలపై మోదీ, నితీశ్‌ ఏరియల్‌ సర్వే

బిహార్‌లోని వరద ప్రాంతాల్లో శని వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విహంగ వీక్షణం చేశారు.

వరద ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్‌ సర్వే
పూర్ణియా: బిహార్‌లోని వరద ప్రాంతాల్లో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విహంగ వీక్షణం చేశారు. తక్షణ ఆర్థిక సాయం కింద బిహార్‌కు రూ. 500 కోట్లు ప్రకటించారు. వరదల్లో చనిపోయిన ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ. 50 వేలు అందజేస్తామని హామీనిచ్చారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో ఒక కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని తెలిపారు. బీమా కంపెనీలు వెంటనే వరద ప్రాంతాలకు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు.

 రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో చునాపూర్‌ విమానాశ్రయంలోనే ప్రధాని సమీక్ష నిర్వహించారు.  బిహార్‌కి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని హామీనిచ్చారు. వరదల ప్రభావం సుమారు 19 జిల్లాలపై పడిందని, 13 జిల్లాల్లో దారుణంగా నష్టం వాటిల్లిందని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. పూర్ణియా, కటిహార్, కిసాన్‌గంజ్, అరేరియా జిల్లాల్లో మోదీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. వరదల వల్ల  బిహార్‌లో 449 మంది మృత్యువాత పడగా, 1.67 కోట్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement