బీహార్‌కు భారీగా ఆర్థికసాయం | Prime minister Modi announces Rs 500 crore relief for Bihar | Sakshi
Sakshi News home page

బీహార్‌కు భారీగా ఆర్థికసాయం

Aug 26 2017 1:47 PM | Updated on Aug 15 2018 2:32 PM

బీహార్‌కు భారీగా ఆర్థికసాయం - Sakshi

బీహార్‌కు భారీగా ఆర్థికసాయం

బీహార్‌ రాష్ట్రానికి రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం అందించన్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు.

బీహార్‌: రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం పూర్ణియా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మోదీ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం అందించన్నట్లు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. 

దేశ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరద కారణంగా బీహార్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగాయి. వరదల కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement