
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యావసర ధరల పెంపుతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోమారు పెట్రో బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.19 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రోల్ ధరల పెంపుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.