పార్లమెంట్ లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రిగా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టిన నరేంద్ర మోడీ ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని పలకరించారు. ఆయన లోక్ సభలోకి అడుగపెట్టగానే సభాపక్ష నేతలందరికీ అభివాదం చేశారు. కాగా మోడీని సోనియా, ములాయం సింగ్ యాదవ్ అభినందించారు.
అంతకు ముందు మోడీ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రజల వాణి వినిపించాలన్నారు. 16వ లోక్ సభకు ప్రజలు అద్భుతమైన రీతిలో మెజార్టీ ఇచ్చారన్నారు. మరోవైపు పాలమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ...బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, రాజ్నాథ్ సింగ్లకు అభివాదం చేశారు.