ఏఎస్సై కూతురిని రేప్ చేసి చంపేసిన ఫ్రెండ్స్ | Nagpur Cop's Daughter Rap And Killed By Friends | Sakshi
Sakshi News home page

ఏఎస్సై కూతురిని రేప్ చేసి చంపేసిన ఫ్రెండ్స్

Sep 7 2017 12:41 PM | Updated on Jul 28 2018 8:53 PM

స్నేహితుడు కదా అని నమ్మి వెళ్లినందుకు ఓ ఏఎస్సై కూతురు మానం, ప్రాణం రెండూ పొగొట్టు...

సాక్షి, నాగ్‌పూర్‌: స్నేహం ముసుగులో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై ఆమెను హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బాధితురాలు నాగ్‌పూర్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి కూతురు కావటం ఇక్కడ గమనార్హాం.
 
నాగ్‌పూర్‌ కు చెందిన అసిస్టెంట్ సబ్‌ ఇన్స్‌పెక్టర్ కూతురైన 22 ఏళ్ల యువతి.. అంబర్‌నాథ్ లోని విఖ్రోలి కి చెందిన ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఈ నెల 4న నిఖిలేష్‌ పాటిల్‌ అనే వ్యక్తి తన స్నేహితుడు నీలేష్‌తో కలిసి ఆమె దగ్గరికి వెళ్లాడు. స్థానికంగా ఉండే మరో స్నేహితుడు అక్షయ్‌ వలోడే ఇంట్లో పార్టీ చేసుకుందామంటూ ఆమెను ఆహ్వానించాడు. చిన్నప్పటి స్నేహితుడు, మిగతా వాళ్లు కూడా తెలిసిన వాళ్లు కావటంతో యువతి అందుకు ఒప్పుకుంది. చివరకు వారంతా కలిసి అక్షయ్ ఇంటికి చేరుకున్నారు. 
 
అక్కడ నిఖిలేష్‌, అక్షయ్‌లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీస్ ఫిర్యాదు చేస్తానని చెప్పటంతో భయపడిపోయిన నిందితులు ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆపై శవాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టి దూరంగా పుణే వెళ్లే దారిలో కొల్పాపూర్ వద్ద డంప్ యార్డ్‌లో పడేసి వచ్చారు. అయితే లోపల జరిగిందంతా నిలేష్‌కు తెలీదు. యువతి గురించి పలుమార్లు ఆరాతీసిన నిలేష్‌.. చివరకు మార్గం మధ్యలో వాళ్లు బ్యాగ్‌ను పడవేయటంతో అనుమానం వచ్చిన వాళ్లిద్దరిని గట్టిగా ప్రశ్నించాడు. 
 
దీంతో వాళ్లు అసలు విషయం చెప్పగా.. పారిపోతే చిక్కులు తప్పవని నీలేష్‌ హెచ్చరించటంతో చివరకు వారిద్దరూ రత్నగిరి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. శవాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, అంబర్‌నాథ్‌ అధికారులకు కేసును అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement