ముంబైలో విధ్వంసానికి కుట్ర | Mumbai: ISIS sympathiser who discussed terror plot arrested | Sakshi
Sakshi News home page

ముంబైలో విధ్వంసానికి కుట్ర

Oct 20 2014 8:54 PM | Updated on Oct 22 2018 7:42 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు.

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం ఈ కుట్రను ఛేదించింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్ఐఎస్) సానుభూతిపరుడు, ముంబైకు చెందిన అనీస్ అన్నారీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఓ స్కూలుతో సహా అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపాడు. అన్సారీని కోర్టులో హాజరు పరచగా, ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు. పోలీసులు అన్సారీ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్, డాటాను స్వాధీనం చేసుకున్నారు. అన్సారీ అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో చాటింగ్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement