ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు: రాహుల్ | Modi government was punishing the farmers, says rahul gandhi | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు: రాహుల్

Apr 23 2015 10:14 AM | Updated on Sep 29 2018 7:10 PM

దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేడు పార్లమెంట్ను కుదిపేయనుంది. రాజ్యసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేడు పార్లమెంట్ను కుదిపేయనుంది.  రాజ్యసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.  కాగా నిన్న భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా  జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ  నిర్వహించిన ర్యాలీలో  రాజస్థాన్కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్లే  రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.  ఈ అంశంపై ఆయన నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది.  కాగా లోక్సభలోనూ రైతు ఆత్మహత్యపై చర్చ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ఆప్ నేతలు రెచ్చగొట్టడం వల్లే గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  గజేంద్ర సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement