పోలింగ్ బూత్ సమీపంలో పేలిన బాంబు | Jammu and Kashmir poll:Blast outside Bandipore polling booth | Sakshi
Sakshi News home page

పోలింగ్ బూత్ సమీపంలో పేలిన బాంబు

Nov 25 2014 11:58 AM | Updated on Apr 3 2019 3:52 PM

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను హింసాత్మకంగా మార్చాలని కంకణం కట్టుకున్న ఉగ్రవాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఏకంగా పోలింగ్ బూత్‌లనే టార్గెట్ చేస్తున్నారు.

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను హింసాత్మకంగా మార్చాలని కంకణం కట్టుకున్న ఉగ్రవాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఏకంగా పోలింగ్ బూత్‌లనే టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బందీపురా జిల్లాలో మంగళవారం బాంబు పేలింది. పోలింగ్ కేంద్రం వెలుపల తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలినట్లు తెలుస్తోంది. పేలుడు శబ్దం విన్న భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించాయి. జమ్ము కశ్మీర్‌లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో బందీపురా జిల్లా కూడా ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement