
98 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణ
ఏడుగురు లోక్సభ సభ్యులు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఈ అంశంపై మరింత లోతుగా విచారించి.. ఆ సభ్యుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు సమర్పిస్తామని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖనివేదిక వివరాల్ని ఆర్టీఐ చట్టం కింద అందించలేమని అఫిడవిట్లో బోర్డు వెల్లడించింది. లక్నోలోని ఎన్జీఓ సంస్థ ‘లోక్ ప్రహరి’ ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంను ఆశ్రయించింది. ఆ సంస్థ సుప్రీంకు 26మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది శాససనసభ్యుల ఆస్తుల వివరాలను అందించింది.