భారత్‌ బిడ్డకు స్వాగతం: సుష్మా | Indian Woman Who Alleged Wedding At Gunpoint To Pak Man Returns Home | Sakshi
Sakshi News home page

భారత్‌ బిడ్డకు స్వాగతం: సుష్మా

May 25 2017 11:52 AM | Updated on Sep 5 2017 11:59 AM

భారత్‌ బిడ్డకు స్వాగతం: సుష్మా

భారత్‌ బిడ్డకు స్వాగతం: సుష్మా

పాకిస్తాన్‌ వ్యక్తి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకున్నభారత మహిళ ఎట్టకేలకు భారత్‌కు తిరిగి..

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ వ్యక్తి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకున్నభారత మహిళ ఎట్టకేలకు భారత్‌కు తిరిగి వచ్చింది. ఈమె రాకపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీటర్లో స్పందించింది. ‘భారత బిడ్డకు స్వాగతం.. మీరు ఎదుర్కొన్న పరిస్థితిలన్నింటికి నేను క్షమాపణ చెబుతున్నా’ అని ట్వీట్‌ చేసింది. 
 
ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్‌ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్‌ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు భారత్‌ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని పోలీసుశాఖను ఆదేశించింది. దీంతో నేడు( గురువారం) ఆమె క్షేమంగా భారత్‌ కు చేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement