పరువునష్టం కేసు కొట్టేయండి: రాహుల్ పిటిషన్ | Defamation case: Rahul petition | Sakshi
Sakshi News home page

పరువునష్టం కేసు కొట్టేయండి: రాహుల్ పిటిషన్

Dec 21 2014 5:38 AM | Updated on Sep 2 2017 6:32 PM

మహాత్మాగాంధీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని గతంలో తను చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం.

థానే: మహాత్మాగాంధీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని గతంలో తను చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ఇది జస్టిస్ పీడీ కోడే ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ కోడే తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 6న రాహుల్ భివాండిలోని సోనాలేలో ఓ సభలో మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారే మహాత్మాగాంధీని హత్య చేశారని వ్యాఖ్యానించారు. దీంతో  రాహుల్‌పై ఆర్‌ఎస్‌ఎస్ భివాండి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement