ఢిల్లీవాసులకే 80 శాతం కేటాయించాలని డీడీఏ యోచన
సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) త్వరలో ప్రకటించనున్న 26,300 ఫ్లాట్ల హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లను నగరవాసులకే కేటాయించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు పంపారు. ఇందుకు ఎల్జీ ఆమోదం లభించినట్లయితే పలువురు ఢిల్లీవాసుల సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది. ఇందువల్ల 80 శాతం ఫ్లాట్లు ఢిల్లీవాసులకు లభిస్తాయి. గతంలో డీడీఏ అనేక పథకాలద్వారా దాదాపు నాలుగు లక్షల ఫ్లాట్లను స్థానికులకు అందుబాటులోకి తెచ్చింది. డీడీఏ విధానం ప్రకారం ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ విధానం వల్ల ఢిల్లీవాసులకు, దేశంలోని మిగతా ప్రాంతాలలో నివసించేవారితో సమంగా ఫ్లాట్లు లభించేవి. పైగా ఈ నగరంలో సొంత ఇంటి అవసరమున్న వారి కంటే దేశంలో ఎక్కడో నివసించేవారికి ఇళ్లు దక్కేవి. ఈ నేపథ్యంలో డీడీఏ పథకంలో ఢిల్లీవాసులకు కొంత శాతం ఇళ్లను రిజర్వ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ డిమాండ్ను డీడీఏ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం డీడీఏ వైఖరిలో మార్పు వచ్చింది త్వరలో ప్రకటించనున్న హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లు డిల్లీవాలాల కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎల్జీ వద్ద ఉంది. ఎల్జీ దీనిని ఆమోదించవచ్చని భావిస్తున్నారు. ఈ పథకాన్ని డీడీఏ వచ్చే నెలలో ప్రకటించే అవకాశముంది.
మన ఫ్లాట్లు మనకే
Published Tue, Jul 29 2014 10:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement