సీట్లు లేవు : ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం

Chaos at IGI T3 as over 20 passengers travelling on Air India Delhi Guwahati flight denied boarding passes - Sakshi

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం

20 మందికి బోర్డింగ్‌ పాస్‌లు నిరాకరణ

ఆందోళనకు దిగిన ప్రయాణీకులు

సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లను నిరాకరించడంతో  టెర్మినల్‌ 3వద్ద ప్రయాణికులు  ఆందోళనకు దిగారు.  విమానంలో  సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ  ముందుగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్‌ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్‌ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top