ఒక్కసారిగా కూలిపోయిన భవనం.. 

Building collapse in Indore, One Person Died - Sakshi

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top