ఆ చెత్తంతా ఆపండి.. ఖుష్బూ ఫైర్‌! | Actress Khushbu Fires On Campaign Of Cow Urine Treat Corona | Sakshi
Sakshi News home page

ఆ చెత్తంతా ఆపండి.. ఖుష్బూ ఫైర్‌!

Mar 15 2020 5:22 PM | Updated on Mar 15 2020 5:28 PM

Actress Khushbu Fires On Campaign Of Cow Urine Treat Corona - Sakshi

ఖుష్బూ

చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో...

గోమూత్రం, పేడ కరోనా వైరస్‌కు మందంటూ చేస్తున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. ( కరోనా ఎఫెక్ట్‌: గో మూత్రంతో విందు )
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement