జంటగా వెళ్లి.. ఒంటరిగా..? | Why did Ranbir Kapoor return from US without Katrina Kaif? | Sakshi
Sakshi News home page

జంటగా వెళ్లి.. ఒంటరిగా..?

Jan 8 2014 12:31 AM | Updated on Apr 3 2019 6:23 PM

జంటగా వెళ్లి.. ఒంటరిగా..? - Sakshi

జంటగా వెళ్లి.. ఒంటరిగా..?

సల్మాన్‌ఖాన్‌ని ఓ స్థాయిలో ప్రేమించి, ఆ తర్వాత ఆ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు కత్రినా కైఫ్. అనంతరం కొన్నాళ్లు సోలోగానే జీవితాన్ని కానిచ్చేశారు.

సల్మాన్‌ఖాన్‌ని ఓ స్థాయిలో ప్రేమించి, ఆ తర్వాత ఆ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు కత్రినా కైఫ్. అనంతరం కొన్నాళ్లు సోలోగానే జీవితాన్ని కానిచ్చేశారు. కానీ, త్వరగానే ఆ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పేసి, రణబీర్‌కపూర్‌తో ప్రేమలో పడ్డారామె.  ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారట. ఇద్దరూ జంటగా నటించినప్పుడు ఫర్వాలేదు కానీ, విడివిడిగా సినిమాలు చేసినప్పుడు మాత్రం వీళ్లు మాట్లాడే ఫోన్‌కాల్స్‌కి బారెడు బిల్లు అవుతోందని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఇద్దరూ యూఎస్ వెళ్లారు. రణబీర్‌తో జంటగా వెళ్లిన కత్రినా ఈ హాలిడేని ఎంజాయ్ చేసిన తర్వాత ఒంటరిగా లండన్‌లో ఉండిపోయారు.
 
  కాబట్టి, విహార యాత్రలో ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందనే కథలు అల్లుతున్నారు గాసిప్పురాయుళ్లు. కానీ, అసలు విషయం అది కాదు. యూఎస్‌లో వాతావరణం చాలా చల్లగా ఉన్నందున కత్రినా తట్టుకోలేకపోయారట. దాంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ఈ కారణంగానే ఆమె లండన్‌లో ఉండిపోయారు. అక్కడ కత్రినా తల్లి, ఆమె ఆరుగురు సోదరీమణులు ఉంటారు. వాళ్ల సమక్షంలో తగినంత విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో ముంబయ్ వచ్చేస్తారట ఈ బ్యూటీ. వచ్చీ రాగానే ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. అలాగే తన ప్రియుడు రణబీర్‌కపూర్ సరసన కత్రినా నటించనున్న ‘జగ్గా జాసూస్’ చిత్రం కూడా త్వరలో ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement