ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్ | Sunny Leone says audience will be scared of her | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్

Nov 13 2013 12:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్ - Sakshi

ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్

శృతిమించిన శృంగార సన్నివేశాలతో ప్రేక్షకులను మత్తెక్కించే ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ నియోల్ తొలిసారి విభిన్న పాత్రలో దర్శనమివ్వనుంది.

శృతిమించిన శృంగార సన్నివేశాలతో ప్రేక్షకులను మత్తెక్కించే ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ నియోల్ తొలిసారి విభిన్న పాత్రలో దర్శనమివ్వనుంది. తన తాజా చిత్రం 'రాగిణి ఎంఎంఎస్ 2' ద్వారా ప్రేక్షకులను భయపెడతానని చెబుతోంది. ఏడాది నుంచి షూటింగ్ జరుపుకొంటున్న ఈ హర్రర్ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. 'ఈ చిత్రం విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఇందులో విభిన్న పాత్ర పోషిస్తున్నాను. ప్రేక్షకులను తొలిసారి భయపెడతాననే నమ్మకముంది' అని సన్నీ లియోన్ చెప్పింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తోంది.

గతంలో నీలి చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ప్రస్తుతం ముంబైలోనే మకాం వేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. సన్నీ లియోన్ నటించిన హిందీ సినిమాలు విడుదలయ్యాయి. తాజా చిత్రాన్ని 'రాగిణి ఎంఎంఎస్'కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement