ముహూర్తం కుదిరిందా? | Pooja Hegde to romance Prabhas in Radha Krishna Kumar's next? | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరిందా?

Sep 3 2018 2:06 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde to romance Prabhas in Radha Krishna Kumar's next? - Sakshi

ప్రభాస్‌

‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించే కొత్త సినిమాకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతారనే విషయంపై ఇంకా అధికారికంగా స్పష్టత రావడం లేదు. ‘సాహో’ తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఈ నెల 6న ముహూర్తం కుదిరిందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ఈ నెల మూడోవారంలో ప్రారంభమవుతుందట. ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ యూరప్‌లో జరిపేలా చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఇందుకోసం ఆగస్టులో లొకేషన్‌ సెర్చింగ్‌ను కూడా పూర్తి చేసిందట టీమ్‌. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement