అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు | Mahesh Babu offered prayers at Ajmer Dargah | Sakshi
Sakshi News home page

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు

Sep 18 2014 11:21 AM | Updated on Sep 2 2017 1:35 PM

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు

ప్రిన్స్ మహేష్ బాబు ఆజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రిన్స్ మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆక్షాంకించారు. బిజినెస్మెన్, దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాలలో హీరోగా నటించిన మహేష్ బాబు విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించారు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆగడు చిత్రం రూపొందింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. గతంలో వీరి కాంబినేషన్లో దూకుడు చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదలకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement