ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ | 40 days continuous shooting in Nalugu Stambalata movie | Sakshi
Sakshi News home page

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

May 13 2015 12:00 AM | Updated on Sep 3 2017 1:54 AM

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

ప్రముఖ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘నాలుగు స్థంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్

ప్రముఖ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘నాలుగు స్థంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. ఇషాంత్ వర్మ సమర్పణలో మనెగుంట కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతోంది. కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలక్ష్మీ, గాయత్రీ గుప్తా, శేఖర్, దిలీప్ ముఖ్య తారలు. చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ప్రస్తుత తరానికి తగ్గ కథతో రూపొందిస్తున్న చిత్రం ఇది. జంధ్యాలగారు సినిమాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఈ చిత్రం అంత బాగుంటుంది. ఇటీవల మలేసియాలో 40 రోజుల పాటు నిరాటంకంగా చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్‌తో సినిమా ముగుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement