చైనా ప్రాచీన లేఖకు రూ.213 కోట్లు | Rs .213 crore to China's Old letter | Sakshi
Sakshi News home page

చైనా ప్రాచీన లేఖకు రూ.213 కోట్లు

May 18 2016 2:23 AM | Updated on Sep 4 2017 12:18 AM

చైనా ప్రాచీన లేఖకు రూ.213 కోట్లు

చైనా ప్రాచీన లేఖకు రూ.213 కోట్లు

11వ శతాబ్దంలో ఓ పండితుడు రాసిన 124 అక్షరాలున్న చైనా లేఖకు కాసుల వర్షం కురిసింది. అందమైన అక్షరాలున్న ఆ లేఖను బీజింగ్‌లో నిర్వహించిన వేలంలో రూ. 213 కోట్ల (32 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేశారు.

బీజింగ్: 11వ శతాబ్దంలో ఓ పండితుడు రాసిన 124 అక్షరాలున్న చైనా లేఖకు కాసుల వర్షం కురిసింది. అందమైన అక్షరాలున్న ఆ లేఖను బీజింగ్‌లో నిర్వహించిన వేలంలో రూ. 213 కోట్ల (32 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేశారు. జూసీ టై అనే పేరుతో ఉన్న లేఖను చైనాకు చెందిన కళాభిమాని వాంగ్ జాంగ్‌జున్ దక్కించుకున్నారు. 960-1279 మధ్య కాలంలో సాంగ్ వంశానికి చెందిన ప్రముఖ పండితుడు జెంగ్ గాంగ్ తన స్నేహితుడికి ఈ లేఖ రాశారు. రాజకీయ ఇబ్బందులు, ఒంటరి తనం గురించి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement