ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం బోటు తిరగబడింది.
జకార్తా : ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఆదివారం బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా... మరో ఐదుగురు గల్లంతయ్యారని తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 17 మంది ప్రయాణిస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.