బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎల్బీ స్టేడియం సమీపంలోని ఉన్న ఆయన విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.
హైదరాబాద్: బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎల్బీ స్టేడియం సమీపంలోని ఉన్న ఆయన విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. వీటి నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అబిడ్స్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను గన్ఫౌండ్రీ ఎస్బీహెచ్ నుంచి ఛాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. అలాగే, అబ్దుల్ రెహ్మాన్ పెట్రోల్ పంప్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని నాంపల్లి మీదుగా పంపిస్తారు. ఇవి మంగళవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.