భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి | The worker died falling from a building | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి

Dec 15 2015 6:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు భవనంపై నుంచి కింద పడి మృతి చెందాడు.

నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు భవనంపై నుంచి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన పూర్ణచంద్ర పాల్(24) గచ్చిబౌలిలో ఏబీఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సెంట్రిగ్ కూలీగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 11.40 గంటల సమయంలో 6వ అంతస్తులో సెంట్రింగ్ డబ్బాలు తీస్తుండగా ప్రమాద వశాత్తు జారీ కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement