HYD: అక్టోబర్‌ నాలుగున ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి ఈవెంట్‌ | Achyuta Gopi Spiritual Concert in Hyderabad – Oct 4 at Gachibowli | Sakshi
Sakshi News home page

HYD: అక్టోబర్‌ నాలుగున ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి ఈవెంట్‌

Sep 21 2025 1:26 PM | Updated on Sep 21 2025 2:33 PM

devotional artist Acyuta Gopi concert in Hyderabad on October 4

సాక్షి, హైదరాబాద్: చల్ మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో, రాధాకృష్ణ అకేషన్స్​ సహకారంతో నిర్వహించిన ‘అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్’ సెప్టెంబర్ 20న మాదాపూర్‌లో హెచ్‌ఐసీసీ-నోవోటెల్ (ఎమ్‌ఆర్‌1) వేదికగా విజయవంతంగా జరిగింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గాయని అచ్యుత గోపి తన ఆత్మవంతమైన గీతాలు, భక్తిపూరిత సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నోవాటెల్‌లో నిర్వహించిన వర్చువల్​ మీడియా సమావేశంలో ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి మాట్లాడుతూ..‘భగవద్గీత గొప్పతనం, భాగవతం, భారత సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం గురించి వివరించారు. హైదరాబాద్‌​కి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానన్నారు. చల్​మన్​ వృందావన్​ చేస్తున్న సేవాకార్యక్రమాలు గురించి వివరించారు. కృష్ణ ఎంచుకున్న ప్రజల మధ్య జీవిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తన జీవితంలోకి వెలుగు తెచ్చిన కృష్ణ, గోవింద అంటే ఎప్పటికీ తనకు అపార భక్తిభావం అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భక్తిభావం వెల్లివిరుస్తుందని, హైదరాబాద్‌లో కాన్సర్ట్​ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానన్నారు. రాధాకృష్ణుల జీవితంలోని గొప్పవిషయాలు, నేర్చుకోదగిన విషయాలను వివరించారు. మరో పదిహేను రోజుల్లో తెలుగు ప్రజలను కలుస్తానన్నారు.

అచ్యుత గోపి భారతదేశ యాత్ర సందర్భంగా తన అమృతగానంతో అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి​లో జరిగే కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఈవెంట్ ఆధ్యాత్మికత, సంగీతం కలగలిసిన మరో మరపురాని అనుభవాన్ని అందించనుంది. అక్టోబర్ 4న జరిగే కాన్సర్ట్ టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటోలో అందుబాటులో ఉన్నాయి. మీరూ ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగం అవ్వాలంటే వెంటనే టికెట్స్​ బుక్​ చేసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement