నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరి మృతి | sad incident in ganesh immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరి మృతి

Sep 15 2016 1:13 AM | Updated on Sep 5 2018 2:26 PM

నగరంలో గణేశ్‌ నిమజ్జనంలో బుధవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనంలో బుధవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. చంపాపేట రెడ్డికాలనీలో గణేష్ నిమజ్జనం చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్‌పై గణేష్ నిమజ్జనానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో ఈ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. విద్యుత్ షాక్ కు గురైన ఇద్దరు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను వెంకటేశ్‌, సందీప్‌ అని పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement