ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయండి | pidamarthi ravi commented on modi | Sakshi
Sakshi News home page

ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయండి

May 11 2017 2:06 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయండి - Sakshi

ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయండి

వాణిజ్య పంటలకు మద్దతు ధర విషయంలో టీడీపీ, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి

పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పంటలకు మద్దతు ధర విషయంలో టీడీపీ, బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. కేంద్రం చేయాల్సిన పనులకు రాష్ట్రానిదా బాధ్యత అంటూ మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 12, 13 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఖమ్మంలో ధర్నా చేస్తామంటున్నారని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేవలం చంద్రబాబు దృష్టిలో పడాలనే ఖమ్మం మార్కెట్‌ యార్డుపై దాడికి పురి గొల్పారని విమర్శించారు. వాణిజ్య పంటల మద్దతు ధర కేంద్రం చేతుల్లో ఉంటుందని ఆ పార్టీల నేతలకు తెలి యదా అని ప్రశ్నించారు. రైతుల మధ్య అపోహలు సృష్టించేందుకే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ కలసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement