
'ఆ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 10 లక్షల వంతున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 10 లక్షల వంతున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలుపై టీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో కార్యకర్తల ద్వారా వ్యవసాయ సంక్షోభం గురించి కేసీఆర్ తెలుసుకోవాలని ఆయన అన్నారు. కరువు మండలాలు ప్రకటించకపోవడం వ్యవసాయంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని గండ్ర చెప్పారు.
ఉద్యమకాలంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేయించకుండానే పార్టీలో చేర్చుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని రమణారెడ్డి విమర్శించారు.