అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే: హైకోర్టు | highcourt assures agri gold victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే: హైకోర్టు

Nov 16 2015 11:51 AM | Updated on Sep 3 2017 12:34 PM

అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దని, డబ్బు ఇప్పించే బాధ్యత తమదే అని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దని, డబ్బు ఇప్పించే బాధ్యత తమదే అని హైకోర్టు తెలిపింది. అగ్రిగోల్డ్ కేసును సోమవారం హైకోర్టులో విచారించారు.  వచ్చే వారం లోగా నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐడీని కోర్టు ఆదేశించింది.

అగ్రిగోల్డ్కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను హైకోర్టు అకౌంట్కు మళ్లించాలని కోర్టు తెలిపింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ. 7.40లక్షలను కూడా తమ అకౌంట్కు జమ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement