రద్దైన పెద్ద నోట్లు మార్పిడికి నేటితో గడువు ముగుస్తుండగా పెద్ద మొత్తంలో పాత నోట్లు బయటపడుతున్నాయి.
రూ. 92 లక్షల పాత నోట్లు స్వాధీనం
Mar 31 2017 2:02 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: రద్దైన పెద్ద నోట్లు మార్పిడికి నేటితో గడువు ముగుస్తుండగా పెద్ద మొత్తంలో పాత నోట్లు బయటపడుతున్నాయి. తాజాగా పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 92 లక్షల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


