కృష్ణా నీటి పంపకాలపై బోర్డు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో లభ్యత జలాల పంపిణీపై కృష్ణా బోర్డు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లభ్యతగా ఉన్న 33.77 టీఎంసీల్లో తెలంగాణకు 24.47 టీఎంసీలు, ఏపీకి 9.30 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు మంగళవారం లేఖలు రాశారు. మార్చి 20 వరకు 520 అడుగులు ఉన్న సాగర్‌ మట్టాన్ని మార్చి చివరికి 515 అడుగులు ఉండేలా చూసుకోవాలని తెలిపింది.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top