ఆస్పత్రుల్లో కమీషన్లకు కక్కుర్తి: లక్ష్మణ్‌ | bjp leadar lakshman slams telangana government | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో కమీషన్లకు కక్కుర్తి: లక్ష్మణ్‌

May 6 2017 3:26 PM | Updated on Oct 9 2018 7:18 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణాలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణాలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కమీషన్‌లకు కక్కుర్తి పడి నాసిరకం మందులు రోగులకు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం మందులు లేక, డాక్టర్లు అందుబాటులో లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాసిరకం మందుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం చెల్లించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement