తాగేందుకు డబ్బుల్లేక..మద్యం షాపులకే కన్నం | robbery gang arrested in warangal | Sakshi
Sakshi News home page

తాగేందుకు డబ్బుల్లేక..మద్యం షాపులకే కన్నం

Aug 14 2015 1:38 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్నమద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్: తాళం వేసి ఉన్నమద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.72 లక్షల నగదు, రూ.1.68 లక్షల విలువైన మద్యం సీసాలు, మూడు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పలు మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు.

నిందితులు స్టేషన్ ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ గ్రామ వాసులని హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. నిందితుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వారని వెల్లడించారు. వీరు 16 మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారని... సంపాదించే డబ్బులు తాగేందుకు సరిపడక మద్యం దుకాణాలకే కన్నం వేస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement