గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి తెలిపారు.
'వారి కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంది'
Jan 5 2016 1:21 PM | Updated on Aug 15 2018 9:30 PM
హైదరబాద్: గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రచారం చేసుకోవద్దా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎఫ్సీఐ పునరుద్ధరణ కార్యక్రమానికి నరేంద్ర మోదీ హాజరవుతారని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement