దుక్కితోపాటే విత్తనం/ఎరువు వేసే పరికరానికి
రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ కాలేజీ
ఇసుక, తువ్వ, తేలిక నేలల్లో కాలికి గట్టి మట్టి పెళ్ల తగలదు. కానీ, ఎంత ఇసుక భూములైనా పంటలు సాగు చేయాలంటే దుక్కి చేయకతప్పదు కదా. ఈ భూములను విస్తారంగా సాగుచేసే పెద్ద రైతులైతే ట్రాక్టర్తో దుక్కి చేసుకొని విత్తనం వేసుకుంటారు. కానీ, పావెకరం, అరెకరం, ఎకరం సాగు చేసుకునే బక్క రైతుకు ట్రాక్టర్ అద్దె చెల్లించడం భారమే. కాడెద్దుల కోసం అక్కడా ఇక్కడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అరక కూడా అవసరమైన రోజు దొరుకుతుందన్న నమ్మకమూ లేకుండా పోయింది.
ఈ ఇబ్బందుల్లేకుండా ఇసుక, తువ్వ నేలల్లో పంటలు సాగు చేసే రైతు తనంతట తాను దుక్కి చేసుకోవడంతోపాటు విత్తనం వేసుకునేందుకు ఉపయోగపడే పరికరం అందుబాటులో ఉంటే.. ఎంత బాగుంటుంది? ఇంధనం అవసరం లేకుండా.. మరో మనిషి అవసరం కూడా లేకుండా కావాలనుకున్నప్పుడు, ఒక్కరే సులభంగా వ్యవసాయ పనులు నిశ్చింతగా చేసుకోగలిగితే.. ఎంత బాగుంటుంది? ఈ ప్రశ్నల్లోంచే చిన్న రైతుకు చేదోడుగా నిలిచే పరికరం రూపొందింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. లక్ష్మణరావు మార్గదర్శకత్వంలో బీటెక్ విద్యార్థులు పి.రవిచంద్ర, వై. శివకిరణ్ ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని తొలుత రెండు సైకిళ్లను వినియోగించి తయారు చేశారు. ఇద్దరు మనుషులు నడపాల్సి ఉండడం, ఇతరత్రా సమస్యల వల్ల అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత రెండు సైకిల్ చక్రాలతో కూడిన పరికరానికి విజయవంతంగా రూపుకల్పన చేశారు.
రైతులు సంతృప్తిని వ్యక్తం చేయడంతో పేటెంట్కు దరఖాస్తు చేయడానికి డా. లక్ష్మణరావు సిద్ధమవుతున్నారు. దీనిపైన పెట్టుకొని 50 కిలోల బరువును కూడా పొలానికి తీసుకెళ్లడానికి వీలుందని ఆయన అన్నారు. కేవలం రూ. మూడు నుంచి ఐదు వేల ఖర్చుతో దీన్ని తయారు చేయవచ్చు. దుక్కి దున్నొచ్చు. అంతర సేద్యం ద్వారా కలుపును నిర్మూలించవచ్చు. విత్తనాలు, ఎరువులు వేసుకోవచ్చు. పొగాకు, పత్తి, మిరప, శనగ, కూరగాయల సాగులో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. పెరటి తోటలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సైకిల్ చక్రాలను బిగించడం వల్ల సులభంగా దొర్లుతుంది కాబట్టి మహిళలు కూడా సులువుగా దీనితో వ్యవసాయ పనులు చేయవచ్చు. ఇంటిపట్టున పెరటి తోటల సాగుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
నాలుగు ఎకరాల్లో సేద్యం చేస్తున్నా..
సింగరాయకొండ మండలం కరేడుకు చెందిన రైతు కే వెంకటేశ్వర్లు ఈ పరికరంతో 4 ఎకరాల ఇసుక నేలలో పంటలు పండిస్తున్నారు. వేరుశనగ, జామాయిల్ తదితర నార్ల సాగులో దుక్కి, విత్తనాలు, ఎరువులు వేయడానికి, కలుపు నిర్మూలనకు ఇది ఉపయోగకరంగా ఉందని ఆయన అన్నారు. అరకలు, కూలీల ఖర్చు తగ్గిందన్నారు. మోటారు బిగిస్తే నేలలో పదును ఉన్నప్పుడు నల్లరేగడి, ఎర్రనేలల్లోనూ పైపాటుకు ఈ పరికరాన్ని వాడుకోవడానికి అవకాశం ఉందన్నారు.
- సీ బీ మోహన్రావు, సాక్షి, ఒంగోలు.
ఫొటోలు: ప్రసాద్
మోటారునూ బిగిస్తున్నాం..!
ఈ పరికరం చిన్న రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మరింత తక్కువ శ్రమతో వ్యవ సాయం చేసుకునేలా మోటారు సైకిల్ ఇంజిన్ను కూడా దీనికి అమర్చుతున్నాం. ఖరీదు మరో రూ. 5 వేలు పెరు గుతుంది. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముందుకొస్తే ఈ పరికరాలను తయారు చేయించి రైతులకు అందు బాటు లోకి తేవాలనుకుంటున్నాం.
- డా. ఎం. లక్ష్మణరావు (98491 40465), ప్రిన్సిపల్, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజి, కందుకూరు, ప్రకాశం జిల్లా
చిన్న రైతుకు చేదోడు
Published Mon, Mar 31 2014 2:12 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
తప్పక చదవండి
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement