నేడు వైఎస్సార్ జనభేరి | ys vijayamma election campaign in west Godavari | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ జనభేరి

Apr 24 2014 1:22 AM | Updated on Aug 14 2018 4:32 PM

నేడు వైఎస్సార్ జనభేరి - Sakshi

నేడు వైఎస్సార్ జనభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

 ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిడదవోలు, పోల వరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ జనభేరి సభల్లో ఆమె ప్రసంగిస్తారు. గురువా రం ఉదయం 9 గంటలకు నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండ లం అన్నవరప్పాడులో బయలుదేరి 10గంటలకు పెరవలి చేరుకుం టారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడినుంచి నేరుగా పోలవరం వెళతారు. సాయంత్రం 4గంటలకు పోలవరంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 6 గంటలకు తాళ్లపూడి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. జనభేరి సభలకు అన్ని ఏర్పాట్లు చేశామని, విజయమ్మ రాక కోసం జనం ఎదురుచూస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement