Sakshi News home page

సీఎం పదవికి ఎసరు పెడుతున్న కొడంగల్!

Published Thu, Apr 17 2014 2:30 PM

సీఎం పదవికి ఎసరు పెడుతున్న కొడంగల్! - Sakshi

మహబూబ్నగర్ జిల్లా కొండంగల్లో ఎన్నికల ప్రచారం సీఎం పదవికి ఎసరు పెడుతుందట. అసలు విషయానికి వస్తే  ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాష్ట్ర ముఖ్యంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా వచ్చి కొడంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే... వారు వచ్చే ఎన్నికల్లో ఆ పదవిని కోల్పోతారనే వింత సెంటిమెంట్ గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి నుంచి 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వరకూ కొడంగల్ వచ్చి మాట్లాడి.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వారు అధికారం కోల్పోవడంతో ఈ సెంటిమెంట్‌కు ఊతమిచ్చినట్లయింది.

 

Advertisement
Advertisement