రూ.కోట్లు విలువచేసే ఇసుక క్వారీ కోసం ‘ముఖ్య’ నేత రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు క్వారీలోకి అడుగుపెట్టేందుకు సాహసించని కాంట్రాక్టర్ ... యంత్రాలు, వాహనాలతో నదిలోకి ప్రవేశించారు. భారీగా వెళ్తున్న వాహనాలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. క్వారీలోకి అడుగుపెట్టటానికి వీల్లేదని ఎదురుతిరిగారు.వాహనాలకు అడ్డుగా పశువులను నిలిపారు. సమాచారం అందుకున్న తుళ్లూరు ఎస్ఐ, సీఐ సుధాకర్, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు, స్థానికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. చివరకు భారీ వర్షం ప్రారంభంకావడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం, రాయపూడి ప్రాంతం కృష్ణా నదిలో కొద్దిరోజుల కిందట డ్రెడ్జర్లతో భారీ ఎత్తున ఇసుకను డంప్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే ఆ ఇసుకను అధికారపార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలతో కంగుతిన్న మాఫియాముఠా తవ్వకాలతో పాటు రవాణాను నిలిపివేసింది. కొన్ని రోజుల తరువాత స్థానికులు ఆ ఇసుకను అవసరాల కోసం తరలించటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాఫియా ముఠా సభ్యులు క్వారీ వద్దకొచ్చి స్థానికులను బెదిరించే ప్రయత్నాలు చేశారు. ఎంతకీ వినకపోవటంతో పోలీసులు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులను రంగంలోకి దింపారు. వారి మాటలనూ లెక్కచేయకపోవటంతో అధికార పార్టీకి చెందిన ‘ముఖ్య’ నేతను ఆశ్రయించారు.
‘ముఖ్య’ నేత ఆదేశాలతో ఇసుక తరలింపు...
ఇసుక తరలింపునకు ‘ముఖ్య’ నేత పచ్చజెండా ఊపటంతో మాఫియా ముఠా రెండు రోజులుగా నదిలోని క్వారీ వద్దకు భారీ ఎత్తున వాహనాలను పంపారు. డంప్చేసిన ఇసుకను యంత్రాలతో లారీలకు నింపే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే స్థానికులు అడ్డుకోవటంతో శనివారం ఇసుక తరలింపును నిలిపివేశారు. తిరిగి ఆదివారం క్వారీ వద్దకు భారీ ఎత్తున వాహనాలు రావటం గమనించిన స్థానిక మహిళలు నదిలోకి వెళ్లకుండా కరకట్టపైనే వాహనాలను అడ్డుకున్నారు. వాహన డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మొదట ఎస్ఐ, ఆ తరువాత సీఐ, అనంతరం ఏఎస్పీ కరకట్ట వద్దకు చేరుకున్నారు.
వాహనాలు నది లోకి వెళ్లటానికి వీల్లేదని స్థానికులు అడ్డుకున్నారు. అరెస్టు చేయదలిస్తే చేసుకోండంటూ బైఠాయించారు. ఇసుక తరలింపును ఆపటం తమ చేతుల్లో లేదని, పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని ఏఎస్పీ తేల్చిచెప్పారు. అత్యున్నత న్యాయస్థానం, గ్రీన్ట్రిబ్యునల్ ఆదేశాలను గుర్తు చేశారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదనే నిబంధన గురించి తెలియదా? అని స్థానికులు ఏఎస్పీని ప్రశ్నించారు. అదంతా తనకు తెలియదని, పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించక తప్పదని మరో సారి తేల్చిచెప్పారు. కొంత సమయం పాటు పోలీసులు, స్థానికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. ఇసుక తరలింపు గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే సీఎం లేదా మంత్రులను కలవాలని ఏఎస్పీ స్థానికులకు వివరించారు. ఇంతలో భారీ వర్షం రావటంతో పోలీసులు, స్థానికులు, వాహనాలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
నివాస నిర్మాణాల పేరుతో ఇసుక డంప్లు ...
స్థానికంగా నివాసాలు నిర్మించుకునేందుకంటూ కొందరు అధికారపార్టీ నేతలు గ్రామాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. రాయపూడి, బోరుపాలెం తది తర గ్రామాల్లో ఈ తరహా ఇసుక నిల్వ లు కనిపించాయి. పగలంతా కృష్ణా నది లో ఇసుకను డంప్ చేయటం.. రాత్రి పూట వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు పత్రికలు, మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగా రాయపూడిలో ఓ టీడీపీ నేత నివాసం వద్ద భారీఎత్తున ఇసుక డంప్ కనిపిం చింది. ఈ విషయం గురించి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
క్వారీలో తిరుగుబాటు
Published Mon, Mar 20 2017 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
Advertisement