పాముకాటుతో మహిళ మృతి | woman dies of snake byte | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Jul 12 2017 9:25 PM | Updated on Oct 22 2018 2:22 PM

ధర్మవరంలో ఓ చేనేత కార్మికురాలు పాముకాటుతో చనిపోయింది. వివరాల్లోకెళితే... శాంతినగర్‌లో ఇంట్లో నిద్రిస్తున్న చేనేత కార్మికురాలు ప్రభావతి (27)కి పాము కాటువేసింది.

ధర్మవరం అర్బన్ : ధర్మవరంలో ఓ చేనేత కార్మికురాలు పాముకాటుతో చనిపోయింది. వివరాల్లోకెళితే... శాంతినగర్‌లో ఇంట్లో నిద్రిస్తున్న చేనేత కార్మికురాలు ప్రభావతి (27)కి పాము కాటువేసింది. ఏదో కుట్టిందని భర్త ప్రభాకర్‌కు చెప్పడంతో ఆమెను వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. పాము కాటు వేయడంతో ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు ప్రభుత్వానికి విన్నవించారు. చంద్రన్న బీమా పథకం కింద రూ.5 వేల తక్షణ సాయం కింద వార్డు కౌన్సిలర్‌ భావమ్మ తనయుడు రాళ్లపల్లి బాబు ఆర్థికసాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement