పెళ్లయిన ఆరు నెలలకే... | woman commits suicide due to harassment | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఆరు నెలలకే...

Aug 27 2017 11:12 AM | Updated on Nov 6 2018 8:08 PM

పెళ్లయిన ఆరు నెలలకే... - Sakshi

పెళ్లయిన ఆరు నెలలకే...

పెళ్లయిన ఆరు నెలలకే ఓ నవ వధువు(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

► అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
► అత్తింటి వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు  
విజయనగరం: పెళ్లయిన ఆరు నెలలకే ఓ నవ వధువు(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్త, ఆడపడుచులే కిరోసిన్‌ పోసి కాల్చి చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం... గరివిడి మండలం కుమరాం గ్రామానికి చెందిన రాజేశ్వరిని నెల్లిమర్ల పట్టణం అలబానవీధికి చెందిన కారుకొండ రామారావుకిచ్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు.  పెళ్లయిన నుంచే అత్త మారమ్మ, ఆడపడుచు రాజేశ్వరిని ఇబ్బంది పెట్టేవారు. అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారు. ఆమెను తిడుతూ మానసికంగా హింసించేవారు.

కొన్ని సందర్భాల్లో ఆమెను శారీరకంగా హింసకు గురి చేసేవారు.  వినాయక చవితి పండగకి వారం రోజుల క్రితం రాజేశ్వరి కన్నవారింటికి వెళ్లింది. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నెల్లిమర్ల విచ్చేసింది.  వచ్చిన దగ్గరనుంచీ అత్త, ఆడపడుచులు తిట్టడం మొదలుపెట్టారు. రాజేశ్వరిని పెద్దగా నోరేసుకుని తిడుతున్నట్లు చుట్టుపక్కల వారికి వినిపించినప్పటికీ అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇంతలోనే ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే రాజేశ్వరి మృతి చెందింది. ఒళ్లంతా కాలిపోయి బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉంది. పక్కనే కిరోసిన్‌ డబ్బా ఉంది. ఆ దృశ్యం చూసే వారికి హృదయవిదారకంగా అనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చి బోరుమన్నారు. తమ కూతురిని అత్తవారే కాల్చిచంపారని రోదించారు.  గుర్ల ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement