మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నీరు | water give every home with mission bhaghiratha | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నీరు

Sep 4 2016 9:38 PM | Updated on Sep 4 2017 12:18 PM

మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నీరు

మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి నీరు

మాచిరెడ్డిపల్లి (అర్వపల్లి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందించేందుకు రూ.40వేల కోట్లతో మిషన్‌ భగీరథ పనులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు.

మాచిరెడ్డిపల్లి (అర్వపల్లి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందించేందుకు రూ.40వేల కోట్లతో మిషన్‌ భగీరథ పనులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మాచిరెడ్డిపల్లిలో రూ.21లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. మిషన్‌ భగీరథ ద్వారా శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కానుందని చెప్పారు. 2017 డిసెంబర్‌ తర్వాత మల్లన్నసాగర్‌ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలో 1.20లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ రెండోదశ నుంచి గోదావరి జలాలను అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, గుండగాని అంబయ్యగౌడ్, తహసీల్దార్‌ సైదులు, ఎంపీడీఓ శిరీష, సర్పంచ్‌లు శీల స్వరూప, మామిడి రమణమ్మ, మన్నె లక్ష్మినర్సు, ఎంపీటీసీలు మంగమ్మ, బొడ్డు రామలింగయ్య, యారాల రాంరెడ్డి, కళ్లెట్లపల్లి శోభన్‌బాబు, వెంకటబిక్షం, ఉప్పలయ్య, తోట భిక్షం, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement