♦ 13 జిల్లాల నుంచి జ్యోతులు
♦ భూములిచ్చిన రైతులకు చీర, ధోవతులతో ఆహ్వానాలు
♦ కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనను పురస్కరించుకుని పండుగ వాతావరణాన్ని తలపించేలా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులతో సోమవారం రాత్రి ఆర్గనైజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ర్టంలోని 13 జిల్లాల ప్రజలు కాగడాలతో వెలుగుతున్న జ్యోతిని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.
అన్ని గ్రామాల నుంచి సేకరించే మట్టితో ప్రతిమ తయారుచేసే బాధ్యత దేవాదాయ, కల్చరల్ డిపార్ట్మెంట్కు అప్పగించినట్టు తెలిపారు. రాజధాని ఎంపిక, నిర్మాణానికి చర్యలపై మంత్రివర్గ, అసెంబ్లీ తీర్మానాలను ఆ ప్రాంతంలో ప్రదర్శిస్తామని చెప్పారు. భూములిచ్చిన 23వేల మంది రైతులకు చీరా,ధోవతులతో ఆహ్వానపత్రం అందించే బాధ్యతను గుం టూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు అప్పగించినట్టు చెప్పారు. అమరావతి రాజధాని చిహ్నం ఇంకా ఎంపిక కాలేదని, దీనిపై చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతి అందించి దాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు.
పీఎంతోపాటు.. సీఎంలకూ ఆహ్వానం..
ప్రధాని నరేంద్రమోదీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని మంత్రి చెప్పారు. మోదీ వస్తానని చెప్పారని, సింగపూర్, జపాన్ ప్రధానులు, మంత్రుల ఆమోదం ఇంకా లభించలేదని తెలిపారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలివచ్చే అవకాశం ఉన్నందున గన్నవరం విమానాశ్రయం ఎక్కువ ప్లైట్స్ ల్యాండింగ్కు సరిపోదని, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
రాజధాని శంకుస్థాపనకు వారం రోజుల ఉత్సవం
Published Tue, Oct 6 2015 4:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
ప్రచార హోరు..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయాలి
బిల్లులు రాక రెండేళ్లు..
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement