పాముకాటుతో రైతు మృతి | The farmer died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Jul 26 2016 6:54 PM | Updated on Oct 1 2018 2:44 PM

పాముకాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని గంగుగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

పాముకాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని గంగుగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గంగుగూడెం గ్రామానికి చెందిన పోడెం నడపయ్య(45) పాము కాటుకు గురై మృతిచెందాడు. తాను సాగు చేసుకుంటున్న 2 ఎకరాల వరి పొలం వద్దకు వెళ్లగా సాయంత్రం 5 గంటలకు పాము కాటుకు గురయ్యాడు. నడపయ్యను 108 వాహనంలోఎక్కించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రైతుకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే మరణించాడు. నడపయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement