మద్యం సేవించిన దేవస్థానం ఉద్యోగులు? | temple employees drunk | Sakshi
Sakshi News home page

మద్యం సేవించిన దేవస్థానం ఉద్యోగులు?

Feb 7 2017 11:25 PM | Updated on Sep 27 2018 5:46 PM

పోలీసుల తనిఖీలో శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు మద్యం సేవించి పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

 
పోలీసుల తనిఖీల్లో వెల్లడి
 
శ్రీశైలం: పోలీసుల తనిఖీలో శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు మద్యం సేవించి పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు కాలనీ, దోర్నాల తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలివస్తున్న వారిపై వన్‌టౌన్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ తన సిబ్బందితో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 30 మందికి పైగా మద్యం సేవించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు దేవస్థానం సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా పట్టుబడిన వారిలో దేవస్థానం ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement