ఆరిలోవలో టీడీపీ నేతల ముమ్మర ఏర్పాట్లు
స్థలం చదునుకు జీవీఎంసీ ట్యాంకర్తో నీటి తరలింపు
ఆరిలోవ(తూర్పు విశాఖ): కోడి పందాలపై హైకోర్టు ఆదేశాలు.. పోలీసుల హెచ్చరికలను టీడీపీ నేతలు బేఖాతర్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ ముసుగులో సన్నాహాలు జరుపుతున్నారు. ఆరిలోవలో పందాల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న జీవీఎంసీ స్థలాన్ని శుభ్రం చేసి పందాలకు వేదికగా సిద్ధం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు మాత్రం ఇవేమీ తెలియనట్టు మిన్నకుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ముడసర్లోవ రిజర్వాయర్ వెనక జీవీఎంసీకి చెందిన ఖాళీ భూముల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడానికి ఓ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ తముళ్లు సిద్ధమవుతున్నారు. ఇక్కడ జీవీఎంసీకి చెందిన సుమారు పదెకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఇందులో ఎకరం స్థలాన్ని ప్రత్యేక వేదికగా చదును చేశారు. నీటితో తడుపుతూ చుట్టూ సిమెంట్ స్తంభాలు పాతారు. దాన్ని ఓ ప్లాట్ఫాం మాదిరిగా తయారు చేస్తున్నారు. పందెంరాయుళ్ల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని చదును చేశారు. బైకులు, కార్లు నిలపడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేపడుతున్నారు.
గతేడాది నుంచి ఈ సంస్కృతి
నగరంలో ఎప్పుడూ సంక్రాంతికి కోడి పందాల నిర్వహణ సంస్కృతి లేదు. గతేడాది కోడి పందాలకు ఇక్కడ బీజం పడింది. సాక్షాత్తు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబే ఈ పందాలను గతేడాది ప్రారంభించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల కోడి పందాల సంస్కృతి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ వ్యాపించినట్లయింది. అందుకే దాన్ని కొనసాగించాలని ఇప్పుడు ఎలాంటి ఆదేశాలనైనా పట్టించుకోకుండా తెలుగు తమ్ముళ్లు ముందుకెళుతున్నారు. భోగి, సంక్రాం తి, కనుమ రోజుల్లో ఇక్కడ పందాలు నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొందరు పందెంరాయుళ్లు ఇప్పటికే నగరానికి చేరుకొన్నట్లు సమాచారం.
కోర్టు ఆదేశాలూ బేఖాతర్
సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించకూడదని కొద్ది రోజుల కిందట ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం డీజీపీ ఎన్.సాంబశివరావు కూడా పందాలు నిర్వహించొద్దని, ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోం మంత్రి చినరాజప్ప కూడా కోడి పందాలు జరిపితే కేసులు పెడతామని మంగళవారం ప్రకటించారు. ఇన్ని హెచ్చరికలు, ఆదేశాలు ఉన్నా ఇక్కడ టీడీపీ తమ్ముళ్లకు మాత్రం పట్టడంలేదు. ఆదేశాలతో మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో జీవీఎంసీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం విశేషం. ఆ నీటితోనే ఇక్కడ స్థలాన్ని తడిపి పందేలు నిర్వహించే ప్లాట్ఫాం తయారు చేస్తున్నారు.
కోడి పందాలకు..
Published Thu, Jan 12 2017 1:53 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement