పాపం.. పసివాళ్లు! | sin children | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాళ్లు!

Aug 9 2016 12:33 AM | Updated on Sep 4 2017 8:25 AM

ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు.. రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందింది. దీంతో అమ్మానాన్నలను కోల్పోయిన ఐదుగురు ఆడ పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర సంఘటన రైల్వేకోడూరు మండలం నడింపల్లెలో చోటు చేసుకుంది.

నడింపల్లె(రైల్వేకోడూరు రూరల్‌): ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు.. రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందింది. దీంతో
అమ్మానాన్నలను కోల్పోయిన ఐదుగురు ఆడ పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర సంఘటన రైల్వేకోడూరు మండలం
నడింపల్లెలో చోటు చేసుకుంది.
 రైల్వేకోడూరు మండలం చియ్యవరం పంచాయతీ నడింపల్లెకు చెందిన రజక వృత్తి చేసుకునే
మడితపు శివయ్య(35)కు తన మేనత్త కూతురైన బుజ్జమ్మ(31)తో వివాహమైంది. కొడుకు కావాలనుకున్న శివయ్య
ఐదుగురు ఆడపిల్లలు సంతానం కలిగినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించలేదు. ఈ నేపథ్యంలో కూలి పనులు కరువై,
కుటుంబ పోషణ భారమై ఏడాది క్రితం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక, పిల్లలను
పోషించుకునే స్థోమత లేక బుజ్జమ్మ గతంలో మూడుసార్లు  ఆత్మహత్యకు యత్నించింది. చివరగా ఈ నెల 3వ తేదీన విష
ద్రావణం తాగింది. విషయం తెలుసుకున్న బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ
ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం నడింపల్లెకు
తీసుకొచ్చారు. గతంలో ఆమె భర్తను ఖననం చేసిన ప్రదేశంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

అనాథలుగా మారిన పిల్లలు
ఆలనా.. పాలనా చూడాల్సిన తండ్రి అర్థంతరంగా కన్ను మూశాడు. తల్లి కూడా తండ్రి చెంతకే చేరింది. దీంతో వారి
ఐదుగురుఉ సంతానం అనాథలుగా మారారు. దీంతో మృతురాలి మామ వెంకట సుబ్బయ్య తాను అండగా ఉంటానని తెలిపారు.
వీరి మొదటి కుమార్తె శిరీషా(11), రెండవ కుమార్తె ప్రసన్న (9) ముక్కావారిపల్లెలోని కస్తూర్బా పాఠశాలలో
చదువుకుంటున్నారు. మూడవ కుమార్తె మల్లీశ్వరి(8) చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఉన్న పెద్దమ్మ వద్ద ఉంటూ
చదువుకుంటోంది. నాల్గవ కుమార్తె నందిని(7)స్థానిక పాఠశాలలో రెండవ తరగతి చదవుతుండగా, నాలుగేళ్ల వయస్సు ఉన్న
లిజిత స్థానిక అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది.

అమ్మా.. లేయ్‌
తల్లి మరణించిన విషయం తెలియని మృతురాలి చిన్నకూతురు మృతదేహం వద్దకు వెళ్లి.. అమ్మా.. లేయ్‌ అమ్మా.. ఇంటికి పోదాం.. అంటుంటే ఈ దృశ్యాన్ని చూసిన వారు చలించి పోయారు. పాపం.. చిన్న పిల్లలు.. దేవుడా.. వీరేం పాపం చేశారని.. ఇంత అన్యాయం చేశావంటూ ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.
స్పందించిన ఐసీడీఎస్‌ పీడీ
తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారన్న విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ పీడీ రాఘవరావు స్పందించి ఏసీడీపీఓ లూక్‌ను పంపించి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. స్థానిక ఎంపీటీసీ రవికుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement