
నిబంధనలతో నాకేం పని..
నెల్లూరు సిటీ : నెల్లూరు మేయర్ తాను అనుకున్నదే చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి తన సొంత మనిషిని కార్పొరేషన్ ఈ–పేపర్ ఎడిటర్గా నియమించుకుని రూ.50 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించారు.
- ఈ–పేపర్ ఎడిటర్కి రూ.50వేలు జీతం
- అధికారులకు మేయర్ అజీజ్ ఆదేశాలు
దీనిపై కార్పొరేషన్ అధికారుల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్కు కట్టిన ధనాన్ని, సొంత మనుషుల కోసం ఖర్చు చేయడంపై అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓ అధికారి కూడా మేయర్కు అంతమొత్తంలో చెల్లించడంపై విమర్శలు వస్తాయని సలహా ఇచ్చారు. అయితే మేయర్ అజీజ్ మాత్రం అవేం పట్టించుకోలేదు.